దేశంలో మరో మారు బీజేపీ నెగ్గి ప్రధాని పదవి చేపట్టాలని మోడీ ఆరాటపడుతున్నారు. ఆయన్ని ప్రధాని కుర్చీ మీద నుంచి లాగేయాలని కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఈ సమయంలో సొంత పార్టీలోని ఓ ఫైర్ బ్రాండ్ మోడీకి సెకండ్ చాన్స్  లేనే  లేదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మోడీ మళ్ళీ రావాలంటే అద్భుతమే జరగాలని కూడా జోస్యం చెప్పేశారు.


ఈసారి ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా 60 ఎంపీ సీట్లు తగ్గిపోతాయి. మిత్ర పక్షాలతో  కలుపుకున్నా మ్యాజిక్ ఫిగర్ కి చేరువ కావడం కష్టమే. రాష్ట్రపతి మొదటి  చాన్స్ ఎండీయేకు ఇస్తే మోడీ ప్రధాని అవుతారు. లేకపోతే మాత్రం ఆయనకు తలుపులు బంద్ అయినట్లేనని కుండబద్దలు కొట్టారు ఫైర్ బ్రాండ్, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి.


ఓ జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించిన స్వామి బాలకోట్ వైమానిక దాడులు బీజేపీని కొంత వరకూ కాపాడాయని, లేకపోతే మరింతగా పరిస్థితి దిగజారిపోయేదని అన్నారు. మోడీ గొప్ప సంస్కరణలు చేపట్టారని, అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని స్వామి చెప్పుకొచ్చారు.


దేశంలో యాంటీ మోడీ వేవ్ ఉందని, బీజేపీలో కూడా అలాగే ఉందని, అందువల్ల మోడీని పక్కన పెడితే చాలా మంది ఇతర పార్టీల నుంచి మిత్రులు బీజేపీకి సహాయం చేయడానికి రావచ్చునని కూడా స్వామి చెప్పారు. అలాంటపుడు బీజేపీలో  నితిన్ గడ్కరీ పేరు కూడా ప్రధాని పదవికి ముందుకు రావచ్చునని స్వామి చెప్పారు మోడీ మళ్ళీ రారు అన్న డౌట్ బీజేపీలోనే కాదు, మోడీకి కూడా ఉందని స్వామి చెప్పడం అసలైన కొస మెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: