ఏపీలో ఎన్నికలు జరిగాయి. అలా ఇలా కాదు, హోరా హోరీగా జరిగాయి. ఇక ఫలితాలు రావాల్సివుంది. ఈ సమయంలో ఏ పార్టీ నాయకులైనా సహనంతో ఉండాలి. ఏపీలో మాత్రం టీడీపీ, వైసీపీ నేతల మధ్యన మాటల యుధ్ధం  పెద్ద ఎత్తున జరుగుతోంది. మేమేంటే మేం అనుకుంటూ రెండు పార్టీల నాయకులు భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు.


ఈ అతి వైసీపీలో మరీ ఎక్కువైపోయింది. ఆ పార్టీ నాయకులు ఆన్ రికార్డుగా, ఆఫ్ రికార్డుగా కూడా గెలిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కొందరు నేతలైతే మరింత ముందుకు పోయి మంత్రి పదవులను కూడా పంచేసుకుంటున్నారు. ఇక శాఖల విషయం కూడా ఎవరికి వారు ఇచ్చేసుకుంటున్నారు.   ముహుర్తాలు కూడా పెట్టేసుకుంటున్నారు. ఈ పెడ ధోరణి రోజు రోజుకు పెరిగిపోవడంతో ఇపుడు వైసీపీ జనంలో బాగా పలుచన అవుతోంది.  పైగా టీడీపీకి టార్గెట్ కూడా అవుతోంది.


దీని మీద విషయం తెలుసుకున్న జగన్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారట. ఏంటి  ఇది అంటూ తన వద్దకు కొందరు నేతలను పిలిపించుకుని మరీ క్లాస్ పీకారని టాక్. ప్రజల్లో నవ్వులపాలు అయ్యేలా ప్రవర్తించొద్దు అంటూ జగన్ గట్టిగానే కసురుకున్నట్లుగా చెబుతున్నారు. గెలుపు ధీమా ఉండడం వేరు, రెచ్చిపోవడం వేరు అంటూ నేతలకు చెప్పి సైలెన్స్ అంటూ బాగానే వార్నింగ్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. 
నిజమే వైసీపీకి అనుకూలమైన వాతావర‌ణం ఇపుడుంది. కానీ ఒకవేళ లేని పోనిది ఏదైనా జరిగితే పార్టీ జనంలో తలెత్తుకుని తిరగాలి కదా ఇదే ఇపుడు హై కమాండ్ ఆలోచనగా ఉందిట. దాంతోనే జగన్ ఓవరాక్షన్ చేస్తున్న నాయకులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లుగా న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: