వైసీపీ అధినేత జగన్ ఏం చేస్తున్నారన్న ఆసక్తి ఇపుడు ఏపీ ప్రజలకు బాగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలుస్తుందన్న హైప్ ఓ వైప్ క్రియేట్ అయిన వేళ జగన్ గురించి తెలుసుకోవడానికి అన్ని వైపున నుంచి తెగ ఇంటెరెస్ట్ కనిపిస్తోంది. జగన్ ఆ మధ్యన విహార యాత్రకు వెళ్తే దాని మీద కూడా చాలా మంది అటెన్షన్ పెట్టారు. ఇపుడు కూడా  జగన్ గురించి ఆరా తీసే పనిలో అంతా  ఉండడం విశేషం.


సరిగ్గా ఈ సమయంలో జగన్ గురించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటి అంటే జగన్ మళ్ళీ ఫారిన్ టూర్ వేస్తున్నారని. ఈసారి జగన్ లండన్ వెళ్తున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ జగన్ లండన్ వెళ్ళి అక్కడ రెండు వారాల పాటు గడుపుతారని ఆ న్యూస్ చెప్పే మ్యాటర్. జగన్ కుమార్తె అక్కడ చదువుకుంటోందిట. దాంతో ఆమెను చూసేందుకు, కొన్నాళ్ల పాటు విహార యాత్ర పేరిట  రెస్ట్ తీసుకునేందుకు జగన్ ఈ ట్రిప్ పెట్టుకున్నారని న్యూస్ వైరల్ అవుతోంది.


అదే నిజమైతే వైసీపీకి పెద్ద డ్యామేజ్ అవుతుందని అంటున్నారు. ఓ వైపు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం సహా మూడు జిల్లాలు ఫోనీ తుపాను తో ఇబ్బందులో ఉంటే జగన్ అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అంటే రాజకీయంగా పెను విమర్శలకు దారి తీస్తుందని అంటున్నారు. జగన్ తుపాను బాధితులకు అండగా ఉండడమే కాకుండా సరైన డైరెక్షన్ ఇస్తే అది ఆయనకూ పార్టీకి చాలా మంచిదని అంటున్నారు. మరి జగన్ లండన్ టూర్ న్యూస్ ఎలా బయటకు వచ్చిందో, అది నిజమో కాదో వైసీపీ నేతలే క్లారిటీ ఇవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: