కుటుంబ క‌ల‌హాల‌తో ఎంద‌రో చ‌స్తున్నారు. చిన్న గొడ‌వ‌తో పెద్ద ర‌చ్చ చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సింది పోయి.. అన‌వ‌స‌ర అనుమానాల‌తో, క‌క్ష‌తో ఒక‌రి పై ఒక‌రు దాడులు చేసుకుంటున్నారు. ఏకంగా హ‌త్య‌కు దారి తీస్తోంది. భార్య పంచాయ‌తీ పెట్టిందని ఒక‌రు, ఆర్థిక ఇబ్బందులు అని మ‌రొక‌రు, చిన్న పిల్లలు చెప్పిన మాట విన‌డం లేద‌ని మ‌రికొంద‌రు.. ఇలా ఒక‌టేమిటీ వంద‌ల వేల సంఖ్య‌ల్లో కుటుంబంలో స‌మ‌స్య‌లు ఉన్నాయి. ప్ర‌తి రోజు ఈ ఘ‌ట‌న‌లు టీవీల్లో, పేప‌ర్ల‌లో చూస్తూనే ఉన్నాం. 


చిన్న వివాదం చినికి చినికి గాలివాన‌గా మారి.. ఏకంగా హ‌త్యాయ‌త్నానికి దారి తీసింది. త‌న‌పై భార్య పంచాయ‌తీ పెట్టింద‌న్న కోపంతో భ‌ర్త ఆమెపై హ‌త్యాయ‌త్నం చేశాడు. ప్ర‌కాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడు పాలెంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భర్త దాడి నుంచి గాయాల‌తో బయ‌ట‌ప‌డ్డ భార్య ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది. 


ప్ర‌కాశం జిల్లా నేతివారిపాలెంకు చెందిన శ్రీల‌త‌, శివాజీ భార్యాభ‌ర్త‌లు. కొంత‌కాలం నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు త‌లెత్తాయి. ఈనేప‌థ్యంలో భార్యాభ‌ర్త‌లిద్ద‌రు నాలుగు నెల‌లుగా విడి విడిగా ఉంటున్నారు. అయితీ వీరిద్ద‌రికి 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. శివాజీ కూతురును వేధిస్తున్నాడంటూ శ్రీల‌త ఎమ్మెల్యే వ‌ద్ద పంచాయ‌తీ పెట్టింది. దీంతో భార్యపై భ‌ర్త శివాజీ కోసం పెంచుకున్నాడు. 


శ్రీల‌త త‌న బాబాయ్ తో క‌లిసి బైక్‌పై వెళ్తున్న క్ర‌మంలో శివాజీ కారుతో చేజ్ చేశాడు. అది గ‌మ‌నించిన శ్రీల‌త బాబాయ్ పిచ్చ‌య్య చౌద‌రి అత‌డినుంచి త‌ప్పించుకునేందుకు వేగంగా ముందుకు వెళ్లాడు. అయితే క‌సితో ఉన్న శివాజీ వారి వ‌ద‌ల్లేదు. వెంబ‌డించి మ‌రి బ‌లంగా కారుతో ఢీ కొట్టాడు. అనంత‌రం ఆ కారును అక్క‌డే వ‌దిలి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో శ్రీల‌తతో పాటు ఆమె బాబాయ్‌కి తీవ్ర గాయాల‌య్యాయి. ఇది గ‌మ‌నించిన స్థానికులు వారిని ఒంగోలు రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ప‌రారీలో ఉన్న నిందితుడు శివాజీ కోసం గాలిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: