తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు షాకింగ్ న్యూస్ చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. బాబుకు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఓ మాజీ ఎంపీ స్వీట్ న్యూస్ చెబితే అదే పార్టీలో ఆయన ఒకనాటి సహచరుడు ఉండవల్లి చేదు నిజాన్ని చెబుతున్నారు. పైగా బాబు నలభయ్యేళ్ళ సీనియారిటీని కూడా ఉండవల్లి లాగి మరీ అసలు నిజం మీకూ తెలుసంటూ సెటైర్లు వేశారు.


అసలు ఇంతకీ ఆ నిజం ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని. నలభయ్యేళ్ల అనుభవంతో చెబుతున్నా టీడీపీ నూరు శాతం నెగ్గుతుందని నిన్ననే బాబు ఢంకా భజాయించారు. అయితే బాబు ఆనందాన్ని ఆవిరి చేసేలా ఉండవల్లి షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈసారి ఏపీలో వచ్చేది వైసీపీయేనని బాంబు పేల్చారు. ఇది తన అనుభవం, బాబు అనుభవం కలగలిపి చెబుతున్న న్యూస్ అన్నారాయన.


లగడపాటి  సర్వేలో బాబుకు 130 సీట్లు రావచ్చును, కానీ అదే లగడపాటి సర్వే తెలంగాణాలో తప్పు అయిన సంగతి బాబుకూ తెలుసు అన్నారు. కేవలం ఎన్నికల ముందు తాయిలాలు ఇస్తే ఓట్లు పడవన్న నగ్న సత్యం సీనియర్ పొలిటీషియన్ బాబు కంటే తెలిసిన వారు ఎవరూ ఉండరని కూడా ఉండవల్లి అన్నారు. మొత్తానికి లగడపాటి వారు ఇచ్చిన ధీమాతో బాబు ముఖం కొన్ని రోజులుగా వెలిగిపోతోంది. మరి ఆయన కంటే ఘనుడైన ఉండవల్లి ఇచ్చిన ఈ కౌంటర్ అటాక్ కి బాబు షాక్ తినాల్సిందేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: