రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ సైకో కిల్లర్ లో మరో యాంగిల్ కూడా వెలుగులోకొచ్చింది. అవును మీరు చదివింది నిజమే..
వరుస హత్యలతో హడలెత్తించిన ఉన్మాది ప్రేమలో కూడా పడ్డాడు. శ్రావణి, మనిషా, కల్పన ఇలా ఎంతో మంది అమ్మాయిలను తన ఉన్మాదంతో బుగ్గిపాలు చేసిన ఈ నరరూప రాక్షసుడు అమ్మాయితో ప్రేమాయనం కూడా కొనసాగించాడు. నమ్మసక్యం కాకున్నా ఇది మాత్రం పచ్చి నిజం.
ఇప్పటికే ఉన్మాది శ్రీనివాస్ రెడ్డి బైక్ పై ఫ్రెండ్ తో కలిసి చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. నిత్యం ఎవరితోను మాట్లాడని ఆ మూగ కిల్లర్ శ్రీనివాస్ ఎప్పుడూ వింత వింతగా ప్రవర్తించేవాడు. సంతోషం వస్తే ఆపుకోలేడు. ఎప్పుడు ఎవరితోనూ కలవడు. కానీ లోపల దాక్కున్న ఎలుక లాగా జనాల్లోకి వస్తూ హల్ చేస్తుండేవాడు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ రాక్షసుడు కొంతమందితో ప్రేమాయనం కూడా కొనసాగించాడు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్రెడ్డిలో ప్రేమాయనం కూడా ఉన్నట్టు తాజాగా బయటపడింది. పోలీసులు సైతం విస్తుపోయేలా ఈ కిరాతకుడి నేరాలు, ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాను చూసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అందులో దిమ్మదిరిగే విషయాలు తెలిసాయి.
శ్రీనివాస్రెడ్డి ఫెస్ బుక్ ఎకౌంట్లో 631 మంది స్నేహితులున్నారు. అయితే వీరిలో 600 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. అయితే కనిపించిన అమ్మాయికల్లా ఫ్రెండ్ రిక్వేస్ట్ పెట్టేవాడు. అలాగే వారితో స్నేహం చేసేందుకు ప్రయత్నించారు. ఫ్రెండ్లీగా నటిస్తూ.. వారితో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రయత్నించేవాడు. ఆ తర్వాత వారిని లోబర్చుకునే వాడని పోలీసుల ఇన్వేస్టిగేషన్లో తెలిసింది.
ఫేస్ బుక్ పరిచయంతో అమ్మాయిలను తరచుగా కలుద్దామని చెప్పిన శ్రీనివాస్రెడ్డి... ఎవరినైనా కలిశాడా.. ? కలిస్తే వారిని ఏం చేశాడు.. ఇలాగే వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడా.. ? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హాజీపూర్ నుంచి తరచుగా వేములవాడకు వెళ్లే శ్రీనివాస్ రెడ్డి... వెళ్లే దారిలో నిజామాబాద్.. కరీంనగర్ తదితర ప్రాంతాల్లో అమ్మాయిలను ఏమైనా చేసి ఉంటాడా ? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్రెడ్డి తరచుగా తిరిగే ప్రాంతాల్లో అదృశ్యమైన యువతులు, అమ్మాయిల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
శ్రావణి, మనిషా, కల్పనలను అతి దారుణంగా చంపిన ఉన్మాది శ్రీనివాస్ ఓ యువతి విషయంలో మాత్రం భిన్నం ప్రవర్తించాడు. ఏడాది కాలంగా ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయమైంది .ఆ యువతి పట్ల ఈ సైకో కిల్లర్ చాలా జాగ్రత్తలు పాటించాడు. అయితే ఆ యువతితో ఉన్న సంబంధం గురిచి శ్రీనివాస్ రెడ్డిని ఆరా తీశారు పోలీసులు. తాను వేములవాడకు వెళ్లే క్రమంలో పరిచయమైందని, తాను ఆ యువతిని ప్రేమిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు కిల్లర్. అంతే కాదు తనను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు.
తన ప్రేమను అంగీకరించడంతోనే ఆ యువతి పట్ల సంయమనం పాటించినట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి దుర్మార్గం గురించి తెలియకపోవడంతోనే ఆ యువతి అతడితో చనువుగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒక వేళ పొరపాటు ఆ యువతి తన ప్రేమను తిరస్కరిస్తే ఆమెను కూడా చంపి ఉండే వాడని పోలీసులు భావిస్తున్నారు.