ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత వెలువడిన సర్వేలలో చాలా సర్వేలు వైసీపీకే అధికారం దక్కబోతుందని చెప్పగా, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని తేల్చి చెప్పాయి.
 
అయితే ఏపీలో మారిపోయిన రాజకీయ పరిణామాల దృష్ట్యా గెలుపెవరిదో అంచనా వేయడం చాలా కష్టంగా మారిపోయింది. అన్ని సర్వే ఫలితాలను ఆధారంగా చేసుకుంటే మాత్రం జగన్ గెలుస్తాడని చెబుతున్నారు. అయితే తాజాగా ఒక సర్వే వెలువడింది. ఇది అన్ని సర్వేల మాదిరిగా కాదు కాస్త డిఫరెంట్. ఒక ప్రముఖ ఆలయంలో పనిచేస్తున్న పూజారి టీడీపీకి పెద్ద అభిమాని.

అయితే ఎలాగైనా అధికారంలోకి ఎవరు రాబోతున్నారో తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం రోజు తన గుడికి వచ్చిపోయే భక్తులతో మాట మాట కలుపుతూ ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది?, ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న ప్రశ్నలను అడగడం మొదలుపెట్టాడు. అలా ఎంతమందిని అడగగా ఈ సారి గెలవబోయేది మాత్రం జగన్ అనే చెప్పారు కానీ ఏ ఒక్కరు కూడా టీడీపీ గెల్యుస్తుందని చెప్పలేదట.

ఆ గుడికి రాష్ట్ర నలువైపుల నుంచి భక్తులు వస్తారని వారందరిలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పడంతో తను అభిమానించే పార్టీ ఓడిపోతుందని ముందుగానే ఫిక్స్ అయ్యారట ఆ పూజారి.

అందుకే ఆ గుడికి వచ్చే వారిలో టీడీపీ నాయకులు ఉంటే వారి ఓటమిని ముందుగానే చెబుతున్నాడట. దానితో టీడీపీ నేతలలో మరింత ఓటమి భయం నెలకొంది. ఏది ఏమైనా ఈ పూజారి చెప్పినట్టు వైసీపీ అధికారంలోకి వస్తుందో, లేక టీడీపీ అధికారంలోకి వస్తుందో చూడాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: