అందరికీ షాకులు ఇచ్చే ఏపీ సీఎం చంద్రబాబుకే షాక్ ఇచ్చాడో అభిమాని. కాకపోతే అ షాక్ ప్రేమతో ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుకు అపురూపమైన కానుకలిచ్చి ఓ అభిమాని ఆశ్చర్యపరిచాడో వీరాభిమాని.


ఇంతకీ ఆ అభిమానిి ఇచ్చిన కానుకలేంటో తెలుసా..  చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త రామానుజం చలపతి చంద్రబాబుకు గడియారం, లంచ్ బాక్స్‌ ఇచ్చాడు. ఈ కానుకలే ఎందుకు ఇచ్చాడో తెలుసా.. 

రేయిపగలు కష్టపడుతున్న చంద్రబాబు వేళకు భోజనం చేయాలనే ఆ బహుమతి ఇచ్చాడట. భోజనం కోసం లంచ్ బాక్స్.. సమయం చూసుకునేందుకు గడియారం. ముందు ఆరోగ్యం బావుంటేనే కదా.. ఏదైనా చేయగలిగేది అన్నది రామానుజం కాన్సెప్ట్.

తన ఆరోగ్యం గురించి ఇంతగా అభిమానించే రామానుజం ఇచ్చిన కానుకలు చంద్రబాబును కూడా మురిపించాయట. తనను ఇంతగా ప్రేమించే ఇలాంటి కార్యకర్తలు ఉండటం తన అదృష్టమంటూ చంద్రబాబు ఆనందించి.. అతన్ని అభినందించారట. మరి నాయకుడికీ- కార్యకర్తలకూ ఆ అనుబంధం ఉంటేనా కథ పార్టీ బలంగా ఉండేది. 



మరింత సమాచారం తెలుసుకోండి: