హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి రెండు ముఠాలు హ‌ల్ చ‌ల్ చేశాయి. రెహ్మ‌త్ న‌గ‌ర్‌కు చెందిన టీఆర్ఎస్ లీడ‌ర్ అరుణ్ కుమార్‌కు స్థానిక యువ‌కుల‌కు గొడవ జ‌రిగింది. అది కాస్త చినికి చినికి గాలి వాన‌లా మారింది. ప్ర‌త్య‌క్ష దాడుల‌కు దారి తీసింది. త‌న‌కు న‌మ‌స్తే పెట్ట‌నందుకు క‌క్ష‌పెట్టుకున్న టీఆర్ఎస్ లీడ‌ర్ అరుణ్ అండ్ గ్యాంగ్ త‌న‌పై దాడికి పాల్ప‌డ్డాడంటూ జూబ్లీహీల్స్ పోలీస్‌స్టేషన్‌లో బాధిత యువ‌కుడు మ‌నోజ్ ఫిర్యాదు చేశాడు. 


అయితే పోలీసుల స‌మ‌క్షంలో కూడా గులాబీ శ్రేణులు రెచ్చిపోయారు కూడా. బాధిత యువకుల‌ను అంతం చేస్తాన‌ని.. న‌రికి చంపుతాన‌ని బెదిరింపుల‌కు దిగారు. అయితే ఇంత జ‌రుగుతున్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తు ఉండిపోయారు. త‌మ‌కేమీ ప‌ట్టన‌ట్టు ఉన్నారు. 


హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప‌రిధిలో ఓ గ‌ల్లీ లీడ‌ర్ రెచ్చిపోయాడు. త‌న‌కు న‌మ‌స్తే పెట్ట‌లేద‌న్న కోపంతో కొంద‌రు యువ‌కుల‌పై దాడికి పాల్ప‌డ్డాడు. నిన్న రాత్రి త‌న అనుచ‌రులతో క‌లిసి సెంట‌ర్‌లో నిలుచున్నాడు అరుణ్‌. అదే స‌మ‌యంలో బైక్ పై వెళ్తున్న మ‌నోజ్ అనే వ్య‌క్తి ఆపాడు. క‌నిపిస్తే న‌మ‌స్తే ఎందుకు పెట్ట‌లేదంటూ వాగ్వాదానికి దిగాడు. అంత పొగ‌రు ఎందుకురా అంటూ దుర్భాష‌లాడాడు. అంతటితో వ‌ద‌ల‌కుండా త‌న మ‌నుషుల‌తో బైక్ త‌గుల‌బెట్టించాడు. 


అయితే అరుణ్ అకార‌ణంగా త‌న‌పై దాడి చేశాడని.. కేవ‌లం న‌మ‌స్తే పెట్ట‌లేద‌ని త‌న అనుచ‌రుల‌తో క‌లిసి త‌న‌పై దాడికి దిగాడ‌ని చెబుతున్నాడు మ‌నోజ్‌. ఒక సాదార‌ణ నాయ‌కుడు యువ‌కుడిని తిడుతుంటే పోలీసులు అలాగే చూస్తుండిపోయారు. త‌నకు జ‌రిగిన అన్యాయంపై బాధితుడు మ‌నోజ్ గ‌ల్లీ లీడ‌ర్ అరుణ్ పై పోలీసుల‌కు పిర్యాదు చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: