ఈ మద్య యువత మోడ్రన్ కల్చర్ అంటూ..తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.  వేసుకునే దుస్తుల దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు..తాము నడుచుకునే విధానం అన్నింటిలోనూ మార్పులు వస్తున్నాయి.  వెస్టన్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు.  పబ్ కల్చర్, రేవ్ పార్టీలు ఇలాంటివి సొసైటీలో రోజూ చూస్తూనే ఉన్నాం.  కొన్ని సార్లు యువత నడి రోడ్డుపైనే రొమాన్స్ లు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. 

తాజాగా ఢిల్లీ రోడ్లపై ఓ ప్రేమ జంట రొమాన్స్ పరాకాష్టకు చేరుకుంది. సిగ్గు ఎగ్గు విడిచి.. బైక్‌పై వెళ్తూనే ఆ జంట ముద్దుల్లో మునిగిపోయింది. చుట్టూ జనాలు ఉన్నారని, తాము బైక్‌ రైడింగ్‌లో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి ముద్దులాటలో మునిగిపోయింది. అయితే తాము రోడ్డు పై ఉన్నామని..పది మంది చూస్తున్నారి ఏమాత్రం స్పృహ లేకుండా..నిర్లజ్జగా ముద్దులు పెట్టుకోవడం ఓ ఐపీఎస్ అధికారి వారి రొమాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. 

పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ సమీపంలో జరిగిందీ ఘటన. యువతి బైక్ పెట్రోల్ ట్యాంకుపై కూర్చుంటే యువకుడు డ్రైవ్ చేస్తూనే సరస సల్లాపాల్లో మునిగిపోయాడు.  అయితే ఆ యువకుడు రొమాన్సులో తెలుతూనే తన బైక్ ని కంట్రోలో చేసుకుంటు ముందుకు సాగాడు. సాయంత్రం వేళ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి జంకుగొంకు లేకుండా వారిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోవడాన్ని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. అయితే  ఈ వీడియో చూసి మోటారు వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తేవాల్సి ఉందంటూ ఆయన చేసిన ట్వీట్‌పై కామెంట్లు హోరెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: