చిత్తూరు జిల్లా సుర‌బ‌ల‌కోట‌లోని బీసీ కాల‌నీలో విషాదం నెల‌కొంది. హెడ్‌డ‌బ్ల్యూస్ బ్యాట‌రీస్ పేల‌డంతో ఇద్ద‌రు చిన్నారుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. బ్యాట‌రీతో పిల్ల‌లు ఆడుకుంటున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఆ బ్యాట‌రీ పేల‌డంతో ఇద్ద‌రు  చిన్నారుల మొఖానికి, చేతుల‌కు తీవ్రంగా గాయాల‌య్యాయి. దీంతో వారిని తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 


ఇక పేలుడు ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో పెద్ద శ‌బ్దం వినిపించ‌డంతో వ‌చ్చి చూస్తే ఇద్ద‌రు చిన్నారులు తీవ్రంగా గాయ‌ప‌డి ఉన్నార‌ని చిన్నారుల కుటుంబ స‌భ్యులు తెలిపారు. చిన్నారుల ప్రాణానికి ముప్పులేద‌ని వైద్యులు చ‌ప్పారు. దీంతో కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: