ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది.  గతంలో ఆయనపై పలు మార్లు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఒకరు సిరా ఇంక్ తో అయితే మరొకరు కారంపొడితో దాడి చేశారు. 

తాజాగా  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మోతీనగర్ లో రోడ్‌ షో నిర్వహిస్తున్న కేజ్రివాల్‌పై ..గుర్తుతెలియని వ్యక్తి ఆకస్మిక దాడి చేశాడు.  కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఓ వ్యక్తి ఆయన వాహనం ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంపపై కొట్టారు. దాంతో ఒక్కసారే బిత్తరపోయారు కేజ్రీవాల్.  వెంటనే ఆ వ్యక్తిని ఆప్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

ఇప్పటి వరకూ ఆయనపై ఏడు సార్లకు పైగా దాడులు జరిగి ఉంటాయని సమాచారం.కాగా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై తరచూ దాడి జరగడంపై పూర్తిగా భద్రతా వైఫల్యంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: