ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన మూడు, నాలుగు రోజులకే.. ఓ నేమ్ ప్లేట్ కలకలం రేపింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, గౌవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఇంగ్లీష్‌లో ఉన్న ఆ నేమ్ ప్లేట్ బాగా వైరల్ అయ్యింది. చూశారా.. జగన్ ఎంత పదవీదాహంతో ఉన్నాడో.. సీఎం కాకముందే నేమ్ ప్లేట్ రెడీ చేయించుకున్నాడని టీడీపీ వర్గాలు విమర్శలు చేశారు.. 


ఇప్పుడు ఈ విమర్శలపై నటుడు పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు... ఆయన ఏమన్నారంటే... "ఎవడో వెధవ ఆ నేమ్ ప్లేట్ తయారుచేయించి ఉంటాడు.. దాన్ని వైసీపీ నేతలకు అంటగట్టడమేంటి..? వీళ్లు ఛాన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి బదులు డూప్‌ని తయారుచేస్తారేమో..

" అలాంటి టెక్నాలజీ కూడా ఉంది. నేమ్ ప్లేట్ తయారుచేయించుకోవాల్సిన అవసరం జగన్‌కి లేదు. జగన్ సీఎం పీఠం ఎక్కిన తర్వాత, నేమ్ ప్లేట్ ఆటోమేటిక్‌గా అధికారులే గౌరవంగా జగన్‌కు తెచ్చి ఇస్తారు. " ఇదీ పృధ్వీ స్పందన. 

ఇంతటితో ఆగకుండా.. ఆల్రెడీ జగన్ నేమ్‌ ప్లేట్ కు  సంబంధించి ఏర్పాట్లు ముందుగానే జరుగుతూ ఉండొచ్చు.. అని కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నేమ్ ప్లేట్ వరకూ ఓకే.. కానీ ఏకంగా జగన్‌కు డూప్‌ ను తయారు చేస్తారేమో అని కామెంట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: