జగన్ సీఎం అవ్వటం ఇక లాంఛనమేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. టీడీపీ ఓటమి ఖాయమని, చంద్రబాబు మాటల్లోనే తెలిసిపోతుందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైసీపీ నుంచీ 67 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఫిరాయింపు రాజకీయాలతో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. వైసీపీ జెండాపై, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలు వరుసబెట్టి టీడీపీలో చేరారు. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడిపోయారు.
అంతటితో ఆగకుండా బాబు…. వైసీపీ నుంచీ గెలిచిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మందిని టీడీపీలో చేర్చుకొని వైసీపీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకొని, జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చెయ్యాలని చంద్రబాబు వ్యూహం పన్నారని వైసీపీ ఆరోపించింది. పార్టీ మారిన నేతలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తిచేసినా….స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. వైసీపీ వ్యూహాలు ఫలించనివ్వకుండా చంద్రబాబు చక్రం తిప్పారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనె జగన్ కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడతారని టీడీపీకి చెందిన చాలా మంది ముఖ్య నేతల్ని జగన్ తమ పార్టీలో చేర్చుకుంటారని తెలుస్తోంది.
ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు… వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ పార్టీ నేతలతో వైసీపీ నేతలు టచ్లో ఉంటుండటంపై టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయిత్ జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ఆపరేషన్ ఆకర్ష్ ఉంటందంటున్నారు పార్టీ వర్గాలు. 2019లో తాము పార్టీ పిరాయింపులకు ప్రోత్సహించకుండా… టీడీపీకి రాజీనామా చేసిన వాళ్లనే వైసీపీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచీ రాజీనామా చేసి బయటకు వచ్చిన నేతలను… తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయించి, వైసీపీ తరపున గెలిచేలా చేసుకోవాలని జగన్ పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.