తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం మూడు దశలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడతగా 197 మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.


తొలివిడుతలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్‌లో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది.


బ్యాలెట్‌ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీలకు పింక్‌ కలర్‌, ఎంపీటీసీలకు వైట్‌ కలర్‌ బ్యాలెట్‌ పత్రాలు రూపొందించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: