మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం దేవరయంజాల్‌లో గల జీవీకే ఈఎంఆర్‌ఐలో పాత 108 వాహనాలు సుమారు 60 వాహనాలు దగ్ధమయ్యాయి.  జీవీకే 108 అంబులెన్స్ ల  ప్రధాన  కార్యాలయంలో  సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కి పడ్డారు.  అక్కడి నిలిపి ఉంచిన సుమారు 60 , "108" అంబులెన్స్ లు కాలి బూడిదయ్యాయి.


సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.  అయితే ఇందులో సగానికి పైగా రిపేరు కు వచ్చిన వాహానాలే ఉన్నాయి. మంటలను గుర్తించటంలో సిబ్బంది ఆలశ్యం జరగటంతో భారీ ఎత్తున నష్టం జరిగి ఉంటుందని సమాచారం. మంటలను గుర్తించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 


అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటని అధికారులు పరిశీలిస్తున్నారు. వాహానాల్లో ఉండే వైద్య పరికరాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరగిందా..లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనేది విచారణలో కానీ తేలదు.  మంటలు అదుపులోకి వచ్చాయి... అధికారులు విచారణ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: