ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉందని ప్రచారం చేసుకొని మీడియాలో బాకా ఊదించుకున్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన తొట్టతొలి అభ్యర్థే ఓటమి పాలు కానున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రముఖుడు తన కొడుకు గెలుపుకోసం హోమాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఓటమి అంచను ఉన్నది కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్. మండ్య నుంచి పోటీ చేసిన కుమారుడు నిఖిల్ గెలుపు అంతసులువు కాదనే ప్రచారాల తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామి హోమాన్ని ఆశ్రయిస్తున్నారు.
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనుందనే చర్చలు జోరుగా సాగుతుండటం, మండ్య నుంచి పోటీ చేసిన కుమారుడు నిఖిల్ గెలుపు అంతసులువు కాదనే ప్రచారాలు పెద్ద ఎత్తున్నే జరుగుతున్నాయి. దీంతో దేవుడి ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యానని పదేపదే చెప్పుకుంటున్న కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రస్తుతం క్లిష్టమైన సమస్యలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశాంతతో పాటు అన్నీ అనుకూలంగా జరగాలని కోరుకుంటూ ప్రత్యేక హోమాలను ఎంచుకున్నారు. ఉడిపి జిల్లా సాయిరాధా ప్రకృతి చికిత్సా కేంద్రంలో గడుపుతున్న సీఎం శుక్రవారం సాయంత్రం నేరుగా చిక్మగళూరుకు బయలుదేరారు.
కొప్పళ తాలూకా కమరడి సమీపంలోని అటవీప్రాంతంలో వెలసిన ఉమామహేశ్వరి ఆలయంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఆదివారం మధ్యాహ్నం దాకా హోమాలు నిర్వహిస్తున్నారు. ఉగాది తర్వాత వచ్చిన తొలి అమావాస్య కావడంతో హోమాల ద్వారా దోషాల నివారణలకు అనుకూలమనే ఈ ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం కుమారస్వామితో పాటు భార్య రామనగర్ ఎమ్మెల్యే అనిత, కుమారుడు మండ్య లోక్సభ అభ్యర్థి నిఖిల్తోపాటు దేవేగౌడ, ఆయన భార్య, సోదరుడు మంత్రి రేవణ్ణ కుటుంబీకులు ఈ పూజల్లో పాల్గొననున్నారు. మరి హోమాలు ఫలించి చంద్రబాబు ప్రచారం చేసిన సీఎం కుమారుడు గెలుస్తాడా? వేచిచూడాల్సిందే.