ఈ మద్య దేశంలో అన్యాయాలు..అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా డబ్బు కోసం..ఇతర వ్యహారాల్లో ఎదుటి వారి ప్రాణాలు తృణ ప్రాయంలా తీసి వేస్తున్నారు.  మరోవైపు అక్రమ సంబంధాల కారణంగా కూడా  ఈ హత్యలు బాగా పెరిగిపోతున్నాయి.   తాజాగా తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో దారుణం జరిగింది.  నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. 

హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీని పోలీసులు రిలీజ్ చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు.. మరో వ్యక్తిని నరికి చంపారు. కొడవలితో పాశవికంగా దాడి చేశారు. అతడు తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన తరిమి తరిమి చంపారు.  రోడ్డుపై వాహనాలు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కళ్ల ముందు దారుణం జరుగుతున్నా.. అడ్డుకునే సాహసం చెయ్యలేకపోయారు.

కాగా, ఈ హత్యతో స్థానికంగా సంచలనం చేపింది. స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. తిరునల్వేలిలోని టౌన్ ఆర్చ్ సమీపంలో ఈ మర్డర్ జరిగింది.  కొద్ది సేపటి తర్వాత నింధితులు పోలీసులకు లొంగిపోయారు.  పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: