రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని మోదీని చంపేస్తాన‌నంటూ ఓ బీఎస్ఎఫ్ జ‌వాన్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎవ‌రైనా నాకు 50 కోట్ల రూపాయ‌లు ఇస్తే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని చంపుతానంటూ బీఎస్ఎఫ్ మాజీ జ‌వాను తేజ్ బ‌హ‌దూర్ యాద‌వ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. చ‌క్క‌ర్లు కొడుతు అంద‌ర్నీ షాక్‌కు గురి చేస్తుంది. 


కాగా.. ప్రధాని మోదీపై వారాణసీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున తేజ్‌ బహదూర్‌ వేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానిని హత్య చేస్తానంటూ బహదూర్ చేసిన మాట్లాడిన వీడియో బ‌యటకు రావడంతో అంతా ఒక్క‌సారిగా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. తాను చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ వీడియో రెండేళ్ల క్రితం నాటిద‌ని స‌మాచారం. ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్‌ బహదూర్‌ ఒప్పుకున్నారు. అయితే, ఈ వీడియో వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.


ఒక్క‌సారిగా ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో బీజేపీ నేతలంతా ఆందోళ‌న చెందుతున్నారు. ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహ‌రావు స్పందించారు. ప్ర‌ధానిమోదీపై కుట్ర జ‌రుగుతుంది ఆరోపించారు. మ‌రోసారి మోదీ హ‌త్య‌కు కుట్ర జ‌ర‌గ‌డం అంద‌ర్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని తెలిపారు. అది కూడా ఆయ‌న‌పై పోటీకి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థియే కావంతో అంద‌ర్నీ తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని చెప్పారు జీవీఎల్‌. 


అయితే మోదీని ఎదుర్కొన‌లేకే ప్ర‌తిప‌క్షాలు ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు. కుట్ర పూరితంగానే ఇలా చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కాగా..  వివక్షపూరితంగానే వారాణసీలో తన నామినేషన్‌ను తిరస్కరించారంటూ.. తేజ్‌ బహదూర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: