కేటీఆర్ కు డబ్బు ఎక్కువైతే కాంగ్రెస్ నేతలు, కోదండరామ్ తో పెట్టుకోవాలని... ప్రపంచాన్ని జయించిన తనతో పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు సర్దుకు పోవడానికి తాను ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కాదని చెప్పారు. 2008లో కేసీఆర్ తన వద్దకు వస్తే ఆశీర్వదించానని అన్నారు. మొదట్లోనే తెలంగాణకు తాను మద్దతిచ్చానని... కేసీఆర్ కు ఫండింగ్ కూడా చేశానని చెప్పారు.
ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో కలసిరావాలని, తెలంగాణలో 23 కుటుంబాలు ఏడుస్తున్నాయని అందుకు కారణం కేసిఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేఏ పాల్. ప్రపంచాన్ని జయించిన పాల్తో పెట్టుకోవద్దని..ఇప్పటికైనా కళ్లు తెరచి చూడాలని..విద్యార్థుల ఆత్మక్షోభ ఎవరికీ మంచిది కాదని అన్నారు.