బెట్టింగులు విచిత్రపోకడులు పోతున్నాయి. పార్టీల వారీగా పందేలు అయిపోయాయి. అభ్యర్ధుల గెలుపోటములపైన కూడా బెట్టింగులు కట్టేసుకున్నారు. అందుకే కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి డాక్టర్  మొండితోక జగన్మోహన్ రావు గెలుపుపై పందెలు జోరందుకుంది. వైసిపి అభ్యర్ధి గెలుస్తాడని వైసిపి నేతలు బెట్టింగులు కడితే అందులో వింతేముంది ?

 

అందుకనే జగన్మోహన్ రావు గెలుస్తారంటూ టిడిపి నేత బెట్టింగ్ కట్టారట. ఇపుడీ విషయమే నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య  పోటీ హోరా హోరీగా జరిగింది. అందులో భాగంగానే నందిగామలో కూడా జరిగింది.

 

అయితే టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన  సౌమ్య పై నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా ఎంఎల్ఏ ఎవరికీ అందుబాటులో ఉండరనే ప్రచారం ఉండనే ఉంది. దాంతో ఆమె గెలుపు కష్టమనే మొదటినుండి ప్రచారం జరిగింది.

 

సరే పోలింగ్ జరిగిన తర్వాత ప్రతీ కేంద్రం నుండి వివరాలు తెప్పించుకున్న టిడిపి నేతలు వైసిపి అభ్యర్ధి జగన్ గెలుస్తాడంటూ బెట్టింగులు మొదలుపెట్టినట్లు సమాచారం. వైసిపి అభ్యర్ధి గెలుస్తాడంటూ ఓ టిడిపి నేత రూ. 10 లక్షలు బెట్టింగ్ కట్టారట. ప్రతిపక్షానికి చెందిన అభ్యర్ధి గెలుస్తాడంటూ టిడిపి నేతే బెట్టింగ్ కడుతుంటే ఇక టిడిపి గెలుపు గురించి ఆలోచించేదేముంది ?


మరింత సమాచారం తెలుసుకోండి: