ఏపీ సీఎం చంద్రబాబుకు ముందు ఎన్నికలు పెట్టించి చాలా ఇబ్బంది పెట్టేశారు. ఎన్నికలు అయిపోయి తీరిగ్గా కూర్చోమంటే కూర్చునే రకం కాదు మన చంద్రబాబు. ఆయన నిత్యం హల్ చల్ చేయాలి. ఏదో  ఓ హడావుడి చేయాలి. అలాంటి చంద్రబాబు ఏపీకి మళ్ళీ మరో చాన్స్ వచ్చింది. ఈసారి ఆయన దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారట.


మమత బెనర్జీ పిలుపుపై బాబు గారు బెంగాళ్ళో ఈ రోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఓ విధంగా ప్రచారం అనే కంటే మోడీ మీద విపరీతమైన కోపంతో తిట్టేందుకు ఈ సభను బాబు వాడుకుంటారన్నది నిజం. ఈ మధ్యన వీవీ పాట్స్ మీద  సుప్రీమ్ రివ్యూ పిటిషన్ కొట్టేయండంతో మండిపోతున్న బాబుకు ఇపుడు బెంగాల్లో అవకాశం దక్కుతోంది. మమతపైన మమత సంగతి ఏమో కానీ బాబు గారికి మోడీ మీద కోపం తోనే ప్రచారం చేస్తున్నారన్నది నిజం.


మిగిలిన వారు సైతం ఎవరి రాష్ట్రాలో వారు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప బయటకు రావడం లేదు. ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలా రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారు. తమిళనాడు, కర్నాటక , మహారాష్ట్రలలో ప్రచారం చేసుకొచ్చిన బాబుకు ఇపుడు బెంగాల్ చాన్స్ దక్కింది. ఇక మన‌ బాబోరు ప్రసంగంలో యమ మసాలా దట్టించి మరీ మోడీ మీద విరుచుకుపడడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: