వ్యభిచారం.. అనాదిగా వస్తున్న ఓ వృత్తి.. అమ్మాయిలను ఆటబొమ్మలుగా చేసి వారి రక్తమాంసాలతో చేసే వ్యాపారం. వ్యభిచార నిర్వాహకులు..వారి జీవితాలతో ఆటలాడే పోలీసులు కమీషన్లు దండుకుంటే.. ఆ అమ్మాయిలు మాత్రం తాను పుండై మరొకరికి పండై అన్న తరహాలో చీకటిలో మగ్గేవారు. 


వ్యభిచార గృహాలపై పోలీసులు సీరియస్ గా దాడులు చేస్తే.. విటులతో పాటు అమ్మయిలు దొరుకుతారు.. కానీ విజయవాడలో 20 ఏళ్ల క్రితం వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసినా అమ్మాయిలు దొరికేవారు కాదట. ఎందుకంటే వారిని దాచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవట. 

వ్యభిచార గృహాల్లోని గోడల్లో ప్రత్యేకమైన అరలు ఉండేవట. అలాగే వాటర్ ట్యాంకుల్లోనూ ప్రత్యేకమై గదుల్లాంటివి ఉండేవట. పోలీసుల జాడ తెలియగానే అమ్మాయిలను ఈ అరల్లో దాచేవారట వ్యభిచార నిర్వాహకులు. 

విజయవాడ కమిషనర్ గా డీటీ నాయక్ ఉన్న సమయంలో వ్యభిచార ముఠాల ఆటకట్టించేందుకు ప్రత్యేక మైన నిఘా ఏర్పాటు చేసి.. ఈ గుట్టు బయటపెట్టారట. అప్పటి నుంచి వ్యభిచారం బాగా తగ్గిపోయిందట. ఈ విషయాలన్నీ ఇటీవల జర్నలిస్ట్ సాయి.. తన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: