న‌గ‌రంలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వ‌ర‌స‌కు మ‌న‌వ‌రాలు అయిన బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. వావివ‌ర‌స‌లు మ‌ర‌చిపోయి దిగ‌జారి పోయి వికృత చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. అస‌లు ఆ కామాంధుడిని ఏమాలో నోటినుంచి మాట‌లు కూడా రావ‌డం లేదు ఎవ్వ‌రికీ.. హైద‌రాబాద్‌లో ని మీర్‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 


వ‌ర‌స‌కు మ‌న‌వ‌రాలు అయిన ఆ బాలికకు మాయ‌మాట‌లు చెప్పి  లోబ‌ర్చుకున్నాడు ఆ కామాంధుడు. బాలిక గ‌ర్భం దాల్చ‌డంలో అస‌లు విష‌యం వెలుగులోకొచ్చింది. పెద్ద‌ల స‌మ‌క్షంలో పంచాయ‌తీ పెట్టారు బాలిక త‌ల్లిదండ్రులు.. అయితే అత‌డు చేసిన త‌ప్పుకు రూ.ల‌క్ష‌న్న‌ర చెల్లించాల‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌తో మ‌న‌స్తాపం చెందిన ఆ బాలిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. 


మీర్‌పేట ప్రశాంతినగర్‌కు చెందిన మొగులయ్యకు భార్య పున్నమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2008లో భార్య చనిపోవడంతో 2009లో మిర్యాలగూడకు చెందిన  దుర్గమ్మను వివాహం చేసుకున్నాడు. అయితే దుర్గమ్మ చెల్లి నాగ‌మ్మ కూడా వారుంటున్న వీధిలోనే ఉంటున్నారు.  మిర్యాలగూడలో ఉంటున్న వారి మేనమామ మల్లేష్‌ తరచూ నాగమ్మ, దుర్గమ్మల ఇళ్లకు వస్తుండే వాడు.


అలా వస్తున్న క్ర‌మంలో అత‌డి వ‌క్ర బుద్ధి బ‌య‌ప‌డింది. ఆ కామాంధుడి కన్ను మొగుల‌య్య రెండో కుమార్తెపై ప‌డింది. ఆ బాలిక‌కు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. నెల రోజుల క్రితం బాలిక కడుపునొప్పితో బాధ‌ప‌డ‌గా.. ఆమె త‌ల్లిదండ్రులకు విష‌యం చెప్పింది. దీంతో వారు ఆ బాలిక‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఆమెను ప‌రీక్షించిన వైద్యులు గ‌ర్భందాల్చిందని తెలిపారు. 


ఈ నేప‌థ్యంలో బాలిక తల్లిదండ్రులు మిర్యాలగూడకు వెళ్లి ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. మల్లేష్‌ను నష్టపరిహారంగా రూ.లక్షన్నర చెల్లించాలని పెద్దలు సూచించారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ఆ బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ  ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం నిందితుడు మ‌ల్లేష్ ప‌రారీలో ఉన్నాడ‌ని.. అత‌డి కోసం గాలిస్తున్నామ‌ని తెలిపారు పోలీసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: