హీరో కొడుకు హీరోయే, అమ్మాయి పుడితే హీరోయినే. ఇదే సినిమా థియరీ. కానీ కొంతమంది మాత్రం ఆ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూంటారు. తమకు ఎక్కడ టాలెంట్ ఉందో చూసుకుంటారు. ఆ విధంగా అక్కడే జెండా పాతేస్తారు. ఇపుడు ఓ స్టార్ హీరో కూతురు ఈ మధ్య లేడీ విలన్ వేషాలకు సై అంటోంది. పవర్ ఫుల్ విలన్ అంటే మగవారేనా మేము కాకూడదా అంటూ ఓ దూకుడు మీద దూసుకువస్తోంది.


విషయానికి వస్తే బాలయ్య హీరోగా దర్శకుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కబోతోన్న సినిమాకు కాస్టింగ్ ఫైనలైజ్ చేస్తున్నారు. రు. సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్లో సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో లేడీ విలన్ పాత్రకు ఓ హీరోయిన్ నటించబోతుంది. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ రోల్ ప్లే చేస్తారన్న టాక్ ఇపుడు గుప్పుమంటోంది. అదే జరిగితే బాలయ్యన్ని ఢీ కొట్టే లేడీ విలన్ గా ఆమె వెండి తెర మీద కనిపిస్తారన్నమాట.


ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా జ‌గ‌ప‌తిబాబు కూడా  పవర్ ఫుల్ రోల్ లో  న‌టించ‌బోతున్నారు. లెజెండ్‌ త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌.. జైసింహా సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత అదే హిట్ కాంబినేష‌న్‌ లో ఈ సినిమా రూపొందుతోంది. మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్. మరి చూడాలి బాలయ్య ఆకలి మీద ఉన్నాడు. వచ్చే  సంక్రాంతికి కుమ్మేయాలనుకుంటున్నాడు. మరి ఈ రౌడీ పోలీస్ ఎలాంటి హిట్ కొడతాడో.


మరింత సమాచారం తెలుసుకోండి: