క‌ర్నాట‌క‌లో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రియుడు ఎదుటే ఆరుగురు కామాంధులు ఓ యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న కామ పిశాచులు ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు.  మైసూరు న‌గ‌ర శివార్ల‌లోని లింగాంబుది చెరువు వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 


న‌గ‌రంలోని ఓ లాడ్జిలో ప‌నిచేస్తున్న యువ‌తి, యువ‌కుడు గత కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ క్ర‌మంలో వారిద్ద‌రు స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకునేందుకు రాత్రి లింగాంబుధి చెరువుకు వెళ్లారు. స‌రిగా ఆ టైమ్ లో మ‌ద్యం మ‌త్తులో ఉన్న కామాంధులు అటువైపు వ‌చ్చారు.

అంతే ఆ యువ‌తిని చూసిన కామాంధులుయువ‌కుడిని తాళ్ల‌తో చెట్టుకు క‌ట్టేశారు. అనంత‌రం ఆ యువ‌తిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న జ‌య‌పుర పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ప్రియుడు, ప్రియురాలును ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అందిస్తున్నారు. ఇక కామాంధుల‌ను ప‌ట్టుకునేందుకు మూడు బృందాల్ని రంగంలోకి దింపారు పోలీసులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: