సాధారణంగా సినిమాల్లో హీరో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ముఖ్యంగా ఫైట్ విషయంలో డూప్ ని వాడుతుంటారు. అసలు అతను డూప్ అన్న విషయం కూడా మనకు తెలియనంతగా ఉంటుంటారు.  ఇక ప్రపంచంలో మనిషిన పోలిన మనుషులు ఉంటారని అంటుంటారు..సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి ఫోటోలు, వీడియోలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. 

తాజాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపత్యంలో ముఖ్య పార్టీలు అయిన కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మద్య పెద్ద యుద్దమే అవుతుంది.  ఏ చిన్న విషయం నెగిటీవ్ గా అనిపించినా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకు పడుతున్నారు.  తాజాగా  ఆమ్ ఆద్మీ పార్టీ, తూర్పు బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై సంచలన ఆరోపణ చేసింది.

గంభీర్ ఎండ వేడిమిని తట్టుకోలేక అచ్చం తనలా ఉండే మరో వ్యక్తి చేత ప్రచారం చేయిస్తున్నారని ఆప్ నేత, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. అంతే కాదు ఇందుకు సంబందించిన ఫోటో కూడా ఆయన  సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో గంభీర్ కారులో కూర్చొని ఉండగా, నల్లటి టోపి ధరించిన మరో వ్యక్తి ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు. ‘గౌతమ్ ఎండలో.. గంభీర్ ఏసీలో’ అని ఈ సందర్భంగా సిసోడియా వెటకారంగా ట్వీట్ చేశారు.           


మరింత సమాచారం తెలుసుకోండి: