హ‌జీపూర్ సైకో కిల్ల‌ర్ శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య ర‌హ‌స్యాలు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. నాలుగు రోజులుగా సైకో కిల్ల‌ర్ శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు విచారిస్తు్న‌నారు. ఈ విచార‌ణ‌లో కీల‌క విష‌యాలు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. 


ముగ్గురు అమాయ‌క ఆడ‌పిల్ల‌లు కిరాత‌కంగా ప్రాణాలు కోల్పోయిన హ‌జీపూర్ గ్రామం ఇంకా భ‌యం గుప్పిట్లోనే ఉంది. శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట‌యినా.. ఆ దారుణాలు మాత్ర ఆ ఊరిని.. చుట్టుప‌క్క‌ల ఊళ్ల‌ను వెంటాడుతూనే ఉన్నాయి. శ్రీనివాస్‌రెడ్డి లాంటి మానవ మృగాలు స‌మాజంలో ఇంకెంత మంది మాటువేసి ఉన్నారో అన్న భ‌యం వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. 


హ‌జీపూర్ ఘ‌ట‌న‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒక్కేడే ఉన్నాడా..? ఈ అత్యాచారాల‌కు.. హ‌త్య‌ల‌కు ఎవరైనా స‌హ‌క‌రించారా అన్న కోణంలో విచార‌ణ కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా దీని అంశంపై సిట్ పోలీసులు పోక‌స్ పెట్టారు. కేసు ద‌ర్యాప్తులో భాగంగా సీన్ రీ క‌న్‌స్ట్రాక్ష‌న్ చేయాల‌ని పోలీసులు భావిస్తున్నారు. 


అయితే ఇందుకు శ్రీనివాస్ రెడ్డిని హాజీపూర్ బావి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాల్సి ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో హ‌జీపూర్‌కు శ్రీనివాస్‌రెడ్డిని తీసుకెళ్తే.. గ్రామ‌స్తులు ఊరుకుంటారు. ఇప్ప‌టికే గ్రామ‌స్తులంతా అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నారు.. ఇదే అనుమానం పోలీసుల‌కు వ‌చ్చింది. అందుకే ర‌హ‌స్యంగా ఈ మాన‌వ‌మృగాన్ని ఊరికి తీసుకెల్లాల‌ని సిట్ బృందం భావిస్తోంది. 

ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌ను మాటువేసి కాటు వేసిన క్రూరుడు శ్రీనివాస్‌రెడ్డి ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అత‌డిపై ఇంకెంద‌రు ఫిర్యాదు చేస్తున్నార‌న్న‌ది కీల‌కంగా మారింది. శ్రీనివాస్‌రెడ్డి పాపాల‌చిట్టాను త‌యారుస్తున్నారు పోలీసులు.. అలాడి ఆ రాక్ష‌సుడికి స‌హ‌క‌రించిన వారిపై కూడా పోలీసులు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: