ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో నైట్ పార్టీలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. గెస్ట్ హౌజ్‌లు, రిసార్ట్‌లు, పెద్ద పెద్ద భ‌వనాల్లో బ‌ర్త్ డే పార్టీ పేర్ల‌తో కోన‌సీమ‌న క‌ల్చ‌ర్‌కు తూట్లు పొడుస్తున్నారు. బ‌ర్త్‌డే వేడుక‌ల పేరుతో అమ్మాయిల‌ను ర‌ప్పించుకుని మ‌ద్యం సేవిస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు.

తాజాగా పెనుమంట్ర మండ‌లం మార్టేరులో క‌ల్యాణ మండ‌ప‌టంపై పోలీసులు ఆక‌స్మిక దాడులు చేశారు. అయితే అక్క‌డ జ‌రుగుతున్న పార్టీల్లో 3 వంద‌ల మందికి పైగా యువ‌కులు పాల్గొన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. మ‌ద్యం తాగుతూ అమ్మాయిల‌తో డ్యాన్స్ చేయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 


కాగా.. సంబరాల్లో భాగంగా యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. వేడుకల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: