గత నాలుగు రోజు నుంచి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కి సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  తెలుగు ఛానల్స్ లో ఎంతో ప్రాముఖ్యత సంపాదించిన టీవీ9 ఇప్పుడు అన్ని ఛానల్స్ కి సెన్సేషనల్ న్యూస్ గా మారిపోయింది.  టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్  ఎక్కడికో వెళ్లిపోయారని..ఆయన కెరీర్ పూర్తయ్యిందని..ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. 

తాజాగా  వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి  ‘మెరుగైన సమాజం కోసం’ అని నీతులు చెప్పే రవిప్రకాశ్ గత శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారని విమర్శించారు. 


గత కొంత కాలంగా ఆయన తన ట్విట్టర్ లో ప్రతి విషయంపై స్పందిస్తున్న విషయం తెలిసిందే.  ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం 3 గంటల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడట.

సైబరాబాద్ ఎస్వోటి పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళితే 23 తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబై చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?’ అని ట్వీట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: