ఫోర్జరీ కేసులో విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 రవిప్రకాశ్ గురించి ఇప్పుడు పలు కథనాలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. టీవీ9 సీఈవోగా ఉన్నసమయంలో ఆయన ఎంత దారుణంగా ప్రవర్తించారో ఇప్పుడు కొందరు జర్నలిస్టులు కూడా గుర్తు చేసుకుంటున్నారు.
అందులో ఓ ఘటన ఇదీ.. చిరంజీవి కేంద్రమంత్రి అయిన కొత్తలో, ఆయనను ఇంటర్వ్యూ ఇవ్వమని అనేక చానల్స్ కోరాయి. చిరంజీవి కూడా అన్ని ప్రముఖ చానల్స్ కు వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చారు. కేంద్రమంత్రి హోదాలో వెళ్లారు కాబట్టి.. చిరంజీవికి అన్నిచోట్లా సాదర ఆహ్వానమే లభించింది.
కానీ టీవీ నైన్ లో మాత్రం ఇంటర్వ్యూకి పిలిచిమరీ ఆవమానించారని ఓ జర్నలిస్టు గుర్తు చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ కోసం చిరంజీవి టీవీ నైన్ ఆఫీసుకు వెళ్తే.. ఎవరు ఆహ్వానం పలకలేదట. అంతే కాదు.. చిరంజీవి ఇంటర్వ్యూ పూర్తయి వెళ్లే సమయంలో మిమ్నల్ని రవిపకాశ్ రమ్మంటున్నారని ఓ బోయ్ వచ్చి చెప్పారట.
చిరంజీవి ఫీలైనా ఇక్కడ దాకా వచ్చాం కదా అని పై ఫ్లోర్లో ఉన్న రవిప్రకాశ్ను కలసి వెళ్లారట. చిరంజీవిని తామే పిలిపించి అదే కార్యాలయంలో ఉండి కూడా ఆహ్వానించకుండా రవిప్రకాశ్ అవమానించారని చెబుతున్నారు. అంతే కాకుండా తనకు తానుగా వచ్చి కలవకుండా వేరే వాళ్ళతో రమ్మని పిలిపించుకోవడం ద్వారా కనీస మర్యాద కూడా ఇవ్వకుండా దారుణంగా ప్రవర్తించారని అంటున్నారు.