ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుకున్నది ఒకటి...అయింది మరొకటి అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. తనదైన శైలిలో కేబినెట్ నిర్వహణ మంత్రాంగం నడిపించిన చంద్రబాబు ఇందుకు తగిన రీతిలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో...చివరి ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమావేశం మరింత ఆసక్తినిక రేకెత్తిస్తోంది.
14వ తేదీ కేబినెట్ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్ర్కీనింగ్ కమిటీ... ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పంపించారు. ఈ నెల 10వ తేదీన ఆ నివేదికను ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపండం జరిగిపోయాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చర్చనీయాశంగా మారింది. ఎన్నికల సంఘం అనుమతి కావాలంటే కనీసం 48 గంటల ముందు పంపాలని నిబంధనల్లో ఉంది. ఆ నిబంధన ప్రకారం ఆదివారం సాయంత్రానికి సమయం అయిపోయింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అయ్యారు. కేబినెట్ సమావేశంపైనే చర్చ సాగినట్టు భావిస్తున్నారు. సీఎం- సీఎస్ మధ్య భేటీ సుమారు గంట పాటు కొనసాగింది. అనంతరంలో సీఎస్ తిరిగి సచివాలయానికి వెళ్లిపోయారు. అయితే, వీరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందని తెలియాల్సి ఉంది. సోమవారం సాయంత్రం వరకు ఈసీ నుంచి అనుమతి వస్తేనే కేబినెట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే, అనుమతి కోసం ప్రయత్నించాల్సిందిగా సీఎస్ కోరినట్లు తెలుస్తోంది.