ఓ నేరం ఎందుకు జరుగుతుంది.. ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఎందుకు మృగంగా మారతాడు.. అందుకు దారి తీసే పరిస్థితులు ఏంటి.. ఇటీవల ముగ్గురు బాలికలను చంపిన హాజీపూర్ వాసి శ్రీనివాసరెడ్డి విషయంలో ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా శ్రీనివాసరెడ్డి ఇంటరాగేషన్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. 


సీరియల్‌ హత్యలు ఎందుకు చేశావనే ప్రశ్నకు మాత్రం శ్రీనివారెడ్డి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. ఏమో.. ఆ సమయంలో అలా అనిపించింది.. చంపేశా అని సమాధానమిచ్చినట్లు తెలిసింది. సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాసరెడ్డిలో సైకో లక్షణాలు లేవని పోలీసులు అంచనాకు వచ్చారు. 


పోలీసు కస్టడీలో కూడా శ్రీనివాసరెడ్డి బుద్దిగా ఉన్నాడట. విచారణకు పూర్తిగా సహకరించాడట. అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాడట.  అతణ్ని నల్లగొండ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు తర్వాత వరంగల్‌ కేంద్రకారాగారానికి తరలించారు. 


అంతా అనుకున్నట్లు అతడు గంజాయి, డ్రగ్స్‌కు బానిస కాదట. బీరు మాత్రమే తాగుతాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శ్రీనివాసరెడ్డి లవర్ గా భావిస్తున్న మహిళ క్షేమంగానే ఉన్నట్టు పోలీసులు నిర్థరణకు వచ్చారు. తన ఫేస్ బుక్‌ ఫ్రెండ్స్ లో చాలా మంది ఆడవాళ్లు ఉన్నా.. కనీసం వాళ్లతో చాటింగ్ కూడా చేయలేదంటున్నాడు శ్రీనివాసరెడ్డి. 



మరింత సమాచారం తెలుసుకోండి: