వారంతా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేసినవారు..నటులు...ప్రేక్షకుల మనసు దోచిన వారు..ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసినవారు..అలాంటి  అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలు విశాఖపట్టణం బీచ్ రోడ్డులో ఏర్పాటు చేయగా వాటిని తొలగించారు  జీవీఎంసీ అధికారులు. 

వివరాల్లోకి వెళితే.. ఈమధ్య ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ముగ్గురు సినీ ప్రముఖల విగ్రహాలు ఆవిష్కరించడం జరిగింది.  ఈ ముగ్గురి విగ్రహాల ఏర్పాటుకు జరుగుతున్న పనులను గమనించిన స్థానికులు కొందరు, విశాఖకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను తెచ్చి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని కోర్టును ఆశ్రయించగా, వాటిని వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది.

దీనిపై స్పందించిన   జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  అంతే కాదు విషయం తెలుసుకున్న కొంత మంది సినీ తారులు  అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేని విగ్రహాలను తొలగించే విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గేది లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: