చిత్తూరు జిల్లాలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. తిరుప‌తి నుంచి తిమ‌ల వెళ్లే ర‌హ‌దారిలో ఆర్టీసీ బ‌స్సు, కారు ఢికొట్టాయి. ఈ ప్రమాదంలో ప‌ది మంది భ‌క్తులు స్వ‌ల్ప గాయాల‌తో భ‌య‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌నుమ ర‌హ‌దారిలో చోటు చేసుకుంది. 


ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు వినాయ‌క స్వామి టెంపుల్ దాటిన త‌ర్వాత అదుపుత‌ప్పింది. ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పడంతో కారును ఢీ కొట్టి లోయ‌వైపు దూకెళ్లింది. అయితే అక్క‌డ చెట్టు కొమ్మ‌లు.. పెద్ద పెద్ద వృక్షాలు ఉండ‌టంతో ప్ర‌మాదం త‌ప్పింది. 


ఈ ఘ‌ట‌న‌లో 10 మంది భ‌క్తులు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ఇది గ‌మ‌నించిన స్థానికులు అక్క‌డ‌కు చేరుకున్నారు హుటా హుటినా గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బ‌స్సు కాస్త ముందుకు వెళ్లి ఉంటే ప్ర‌మాదం జ‌రిగి ఉండేద‌ని ప్ర‌యాణికులు తెలిపారు. చెట్లే త‌మ‌ను కాపాడాయ‌ని తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: