ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని చంద్రబాబుకు డీఎంకే చెప్పిందట. ఆ పార్టీ ప్రతినిధి దురై మురుగన్ తాజాగా చంద్రబాబును కలిశారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమయంలో ఏపీ రాజకీయాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.  


ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్‌ ను చెన్నై వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తో సమావేశం నేపథ్యంలో చంద్రబాబు తమను అపార్థం చేసుకునే అవకాశం ఉన్నందువల్ల క్లారిటీ కోసం దురై మురగన్ ను స్టాలిన్ అమరావతి పంపినట్టు తెలుస్తోంది. 


ఎపి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, డిఎమ్ కె అదినేత స్టాలిన్ ల మధ్య చర్చ జరిగిందట. ఏపీలో చంద్రబాబు గెలవడం లేదని, జగన్ గెలుపు ఖాయమని కెసిఆర్ స్టాలిన్ కు చెప్పారట. జగన్‌కు ఎంపీ సీట్లు 18 నుంచి 21 వరకూ వస్తాయని కేసీఆర్ స్టాలిన్‌తో చెప్పారట. 


తాజాగా దురై మురుగన్ చంద్రబాబును కలిసినప్పుడు ఈ విషయాలను ఆయన చంద్రబాబు చెవిలో వేశారట. కేసీఆర్ ఇలా అంటున్నాడు.. మరి మీ సంగతేంటి.. గెలుస్తారా.. లేదా జగన్ గెలుస్తాడా.. అంటూ ఏపీ రాజకీయాలను ఆరా తీశాడట దురై మురుగన్. అదీ సంగతి. 


మరింత సమాచారం తెలుసుకోండి: