మ‌రోమారు హాజీపూర్, బొమ్మలరామారం గ్రామాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ‌ల్ల తెర‌మీద‌కు వ‌చ్చిన ఈ గ్రామ‌స్తులు మ‌రో ఆందోళ‌న చేప‌ట్టారు. అమాయకురాళ్లైన ఆడపిల్లల్ని అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన హాజిపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై బాధిత కుటుంబాలు భగ్గుమంటున్నాయి. అతడిని ఉరి తీయాలని బాధిత తల్లిదండ్రులు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో దీక్ష చేయాలని బాధితుల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. వారి దీక్షకు గ్రామస్థులు, ప్రజా సంఘాల నేతలు  మద్దతు తెలిపారు.


శ్రావణి, మనీషా, కల్పన సహా కర్నూలులో ఓ మహిళను తానే హత్య చేసినట్టు శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కస్టడీలో ఒప్పుకున్నాడు. 6 రోజుల కస్టడీలో ఇంతకు మించి నోరు మెదపలేదు. సైకో శ్రీనివాస్ రెడ్డి మరిన్ని నేరాలు చేసి వుంటాడని భావించిన పోలీసులు.. కస్టడీలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టాలనుకున్నారు. కానీ.. అలాంటిదేమీ తెరపైకి రాలేదు. కస్టడీ గడువు ముగియడంతో శ్రీనివాస్ రెడ్డిని మళ్లీ జైలుకు తరలించారు.


మ‌రోవైపు శ్రీనివాస్ రెడ్డి సీరియల్ హత్యల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా కేసును పరిష్కరించి, ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని ఉరేయాలంటూ చిన్నారి శ్రావణి తల్లిదండ్రులు బొమ్మల రామారంలో దీక్ష చేయాలని నిర్ణయించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: