సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో ఇద్ద‌రు ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కొండ‌పాక మండ‌ల ల‌కుడారం గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. శ‌నికావేశంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. 


ల‌కుడారం గ్రామానికి చెందిన క‌న‌క‌య్య, తార గ‌త కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విష‌యం కాస్త ఇరుకుటుంబాల‌కు తెలిసింది. అయితే రెండేళ్ల క్రితం వీరి ప్రేమ విష‌యంలో గ్రామ‌పెద్ద‌లు క‌న‌క‌య్య‌కు రూ.30 వేలు జ‌రిమానా విధించారు. ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వారి ప్రేమ బ‌ల‌మైంది. 


అయితే కేవ‌లం వారి కులాలు వేరు కావ‌డంతోనే ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లికి పెద్ద‌లు ఒప్పులేదు. దీంతో గ్రామంలోని స్కూలుకు వెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంది ప్రేమ జంట‌. త‌మ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోర‌ని భావించిన ప్రేమికులు త‌మ‌తో తెచ్చ‌కున్న విష‌యం తాగారు.అనంత‌రం పాఠశాల‌లోని ఓ గ‌దిలోకి వెళ్లారు. ఎవ‌రికి తెలియ‌కుండా త‌మ‌తో తెచ్చుకున్న తాడుతో ఇద్ద‌రు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 


కాగా.. ఆ పాఠ‌శాల భ‌వనం నుంచి దుర్వాస‌న రావ‌డంతో అటుగా వెళ్తున్న స్థానికులు లోప‌లికి వెళ్లి చూశారు. అంతే షాక్‌.. లోప‌లికి వెళ్లి చూసిన వారికి ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకుని క‌నిపించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోస్టుమార్టం నిమిత్తం వారి మృత‌దేహాల‌ను ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: