ఏపీలో మ‌రోమారు మావోయిస్టులు త‌మ ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఏకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల‌ను బెదిరించారు. తెలుగుదేశం పార్టీ నేత‌ల తీరును తీవ్రంగా త‌ప్పుప‌డుతూ  ప్ర‌క‌ట‌న జారీ చేశారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరి, స్థానిక నేతలను హెచ్చరిస్తూ మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖ సంచ‌ల‌నంగా మారింది.


మే 1న పనసలొద్ది, కొత్తవాదులపల్లి గ్రామాలపై పోలీసులు దాడి చేసి ఆరుగురు రైతులను చిత్రహింసలకు గురిచేశారని లేఖలో మావోస్టులు ప్రస్తావించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని, లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారని మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం హెచ్చరించారు. కాగా ఈ హెచ్చ‌రిక లేఖ సంచ‌ల‌నంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: