వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని ఇప్పటికే ఆ పార్టీ నేతలు బలంగా ఫిక్స్ అయిపోయారు. అయితే రాజ‌కీయాల్లో ఎత్తులు పైఎత్తులు స‌హ‌జం. త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ కొట్టేందుకు వ్యూహాలు అమ‌లు చేస్తుంటారు. అలాంటి మైండ్ గేమ్ వ్యూహాలు అమ‌లు చేయ‌డంలో బాబు దిట్ట‌.టీడీపీలో కులాల వారీగా కోట‌రి ఉంది. ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శులు చేస్తె అదే కులానికి చెందిన నేత‌ల‌తో కౌంట‌ర్ ఇవ్వ‌డం బాబుకు అల‌వాటె. ఆస‌యం ఇప్పుడు జ‌గ‌న్‌కు వ‌చ్చింద‌నే చెప్పాలి.


వైసీపీ అధికారంలోకి వ‌స్తె జ‌గ‌న్ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన వెంట‌నే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిని రాజకీయంగా దెబ్బకొట్టడంతో పాటు ఆయనతో మైండ్ గేమ్ ఆడేందుకు కూడా సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు స‌మాచారం. అది కూడా తొడ‌ల్లుడు పర్చూరు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ద్వారా బాబును దెబ్బ‌కొట్టాల‌ని చూస్తున్నారు. రాజ‌కీయాల్లో ద‌గ్గుపాటి కంటె బాబు దిట్ట‌.


చంద్రబాబుపై పొలిటికల్‌గా రివెంజ్ తీర్చుకోవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దగ్గుబాటి… ఇందుకోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్ప‌టికే ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటానని ఇప్పటికే జగన్ ప్రకటించారు. దీంతో ద‌గ్గుపాటిని మంత్రిగా తీసుకొనె అవ‌కాశాలు శూన్యం. అందుకే ఆయ‌న‌కు స్పీక‌ర్ ప‌ద‌విని ఇవ్వాల‌ని జ‌గ‌న్ మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది .దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పీకర్ స్థానంలో కూర్చుంటే చంద్రబాబు ఆయనను అధ్యక్షా… అధ్యక్షా అని సంభోదించాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే విషయమే. పైగా బాబుపై పైచేయి సాధించిన‌ట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: