చంద్రబాబు వేరే వారికి వెన్నుపోటు పొడవటంలో అరిపితేరిపోయాడు. చాలా మంది బాబు గారిని వెన్నుపోటుకు సింబాలిక్ గా చెబుతారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాబుకు వెన్నుపోటు పొడవటానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రావడం ఖాయమని ఇప్పటికే సర్వేలు తేల్చేశాయి. అటు తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఈ రెండు పార్టీల్ని కలుపుకుంటే దాదాపు 30 నుంచి 35 ఎంపీ సీట్లు ఉంటాయి.


కేంద్రంలో మేజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి ఆగిపోతే, కాంగ్రెస్ కు వైసీపీ, టీఆర్ఎస్ అత్యంత కీలకంగా మారుతాయి. అందుకే ఇప్పుడా పార్టీ అటు కేసీఆర్, ఇటు జగన్ తో చర్చలు ప్రారంభిస్తోంది. చర్చలు ఫలించి టీఆర్ఎస్-వైసీపీ కలిసి కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయిస్తే మాత్రం అది చంద్రబాబుకు అతిపెద్ద దెబ్బగా మారుతుంది. బాబు ఉన్న కూటమిలోకి రావడానికి జగన్, కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోరు.


అలా అని వీళ్లను వదులుకోవడానికి కాంగ్రెస్ ఇష్టపడదు. కాబట్టి ఏదో ఒకసాకు చూపి చంద్రబాబును నిర్దాక్షిణ్యంగా వదిలించుకోవడానికే కాంగ్రెస్ మొగ్గుచూపుతుంది. అదేకనుక జరిగితే దేశరాజకీయాల్లో ఏకాకిగా మిగిలిపోతారు బాబు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకున్నా చంద్రబాబుకు వెన్నుపోటు తప్పదని భావిస్తున్నారు విశ్లేషకులు. బాబును ఎక్కువకాలం భరించే స్థితిలో కాంగ్రెస్ ఉన్నట్టు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: