వైద్యో నారాయణ హరీ అంటారు..వైద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ మద్య కొంత మంది డాక్టర్ల నిర్వాకం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాాజాగా ఓ డాక్టర్ చేసిన తప్పు వల్ల సుమారు నాలుగు వందల మంది జీవితాలు నావశం అయిన సంఘటన పాకిస్థాన్ లో వెలుగు చూసింది.
లర్కానా (జి) లోని రటోడెరో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ముజఫర్ గంగర్, కలుషిత సిరంజి వాడి వందలాది మంది హెచ్ఐవి బారినపడేలా చేశాడు. నిర్లక్ష్యంతో ఆయన వాడిన సిరంజీ వల్ల 400 మందిలో ఈ వైరస్ లక్షణాలు ఉండగా, వారిలో అత్యధికులు చిన్నారులే ఉన్నారు.
అభం శుభం తెలియని చిన్న పిల్లలను హెచ్ ఐవీ బారిన పడేలా చేసిన ఆ డాక్టర్ కు కఠిన శిక్షపడేలా చేయాలని కొంత మంది..లేదు అతన్ని అందరి సమక్షంలో ఉరి తీయాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.