రవిప్రకాశ్.. ఇప్పుడు తెలుగు మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు.. గతంలో వార్తల ద్వారా సంచలనం సృష్టించిన ఈ జర్నలిస్టు వీరుడు.. ఇప్పుడు తానే ఓ వార్తగానూ సంచలనం సృష్టిస్తున్నారు. రవిప్రకాశ్ ఫోర్జరీ కేసు తర్వాత ఆయన గురించి అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేకించి రవిప్రకాశ్ పై సాక్షి మీడియా విరుచుకుపడుతోంది. ఆయనకు సంబంధించిన నెగిటివ్ షేడ్స్ ను వివరిస్తోంది. రవిప్రకాశ్ జగన్ కు వ్యతిరేక వార్తలకు ప్రయారిటీ ఇచ్చేవాడని.. జగన్ ఇంటి గురించి, సీబీఐ కేసుల గురించి ఉన్నవీ లేనివీ ప్రచారంలోకి తెచ్చాడని జగన్ అభిమానులు అంటున్నారు.
అయితే రవిప్రకాశ్ మరీ అంతగా జగన్తో శత్రుత్వం పెంచుకోలేదట. వాస్తవానికి రవిప్రకాశ్ జగన్ కు చాలా క్లోజ్ కూడా అని ఓ సీనియర్ జర్నలిస్టు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించినప్పుడు ఆ వార్త ప్రసారమయ్యే సమయంలో రవిప్రకాశ్ జగన్తోనే ఉన్నారట.
ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి ఓ టీవీ ఛానల్ చర్చలో తెలిపారు. రవిప్రకాశ్ మొదటి నుంచి జగన్ వ్యతిరేకి కాదన్నది ఆయన అభిప్రాయం. ఆయన చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు. కానీ వైఎస్ మరణం తర్వాత కదా జగన్ కు సీబీఐ కేసుల కష్టాలు మొదలైంది. ఆ సమయానికి జగన్ కూ రవిప్రకాశ్ కు దూరం పెరిగి ఉండొచ్చు కదా.