ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి జగన్.. ఇదీ ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తున్న మాట. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడకపోయినా కాబోయే సీఎం జగనే అన్నది బాగా వినిపిస్తున్నమాట. ఏదేమైనా ఫలితాలు వస్తే కానీ ఏదీ నిజం కాదు కదా.


కానీ వైఎస్ జగన్ మాత్రం తప్పకుండా తమదే అధికారం అని మనసా వాచా నమ్ముతున్నారు. ఆయన తాజాగా తన పాలన ఎలా ఉండబోతోందో చూచాయగా చెప్పారు. జగన్ ఎన్నికల పోలింగ్ తర్వాత మీడియాతో మాట్లాడటం బాగా తగ్గించేశారు. 

పోలింగ్ తర్వాత రోజు మీడియా ముందుకొచ్చి బాగా పని చేశాం. మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఆ తర్వాత మీడియా ముందు మాట్లాడలేదు. తాజాగా ఆయన సొంత జిల్లాలో ఉన్నారు. ఇడుపులపాయలో ఆయన తన తండ్రి వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా జగన్‌ని కలిసిన పలువురు తమ సమస్యలు తీర్చాలంటూ వినతులు సమర్పించారు. అందుకు జగన్‌ స్పందిస్తూ... మనందరికీ మంచిరోజులు రాబోతున్నాయి. ఎవరూ నిరుత్సాహ పడొద్దు. అందరికీ న్యాయం జరిగేలా మన పాలన సాగుతుందని హామీ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: