ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల మ‌రో నాల్రోజుల స‌మ‌యం కూడా లేన‌ప్ప‌టికీ ఏపీలో అధికార పార్టీ నేత‌ల జులుం ఇంకా కొన‌సాగుతోంది. త‌మ ప‌రిధిలో లేని అంశంపై సైతం అధికార జులుం చెలాయించేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదంగా మారింది. ఇలా వివాదం సృష్టించింది ఏపీమంత్రి పత్తిపాటి పుల్లారావు కుటుంబసభ్యులు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద  హల్‌చల్ చేశారు. 


టోల్ ప్లాజా వ‌ద్ద సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాల‌ని కోరారు. దీంతో ప్ర‌తిపాటి భార్య స‌హా కుటుంబ స‌భ్యులు తమ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో అరకిలోమీటర్‌మేర వాహనాలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ తెలంగాణ రాష్ట్రంలో చెల్లుబాటు కాదని.. ఫీజు చెల్లించాల్సిందేనంటూ టోల్‌ప్లాజా సిబ్బంది తేల్చిచెప్పడంతో చివరకు ఫీజు చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: