రాష్ట్రం ఇప్పుడు రావణ కాష్టంగా మారిపోయింది..ఓ వైపు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారు..మరోవైపు ఆమ్మాయిలు, ఆడవారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా..? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంత రావు.   హాజీపూర్ బాధిత కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు.  శ్రీనివాస్ రెడ్డి అనే కామంధుడు అన్యాయంగా ఒకే గ్రామం అయిన హాజీపూర్ కి చెందిన శ్రావణి, మనీషా, కల్పనలను దారుణంగా అత్యాచారం చేసి..ఆపై హత్య చేశాడు. 

ఆ ముగ్గురు బాలికలను బావిలో పూడ్చి పెట్టి ఏమీ ఎరుగని వాడిలా బయట తిరిగాడు.  కానీ పాపం పండి శ్రీనివాస్ రెడ్డి హత్యోదంతాలు బయటపడ్డాయి..ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు.  ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి..లేదా ఎన్ కౌంటర్ చేయాలని అక్కడి ప్రజలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో వీహెచ్చ గ్రామస్తులకు, ధర్నా చేస్తున్నవారికి మద్దలు పలికారు.  ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ..ఇదేమయినా ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత కుమారుడు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే కేసీఆర్ పరామర్శించడానికి వెళ్లారనీ, కానీ హాజీపూర్ బాధితులను కలుసుకోవడానికి మాత్రం వెళ్లలేదని దుయ్యబట్టారు. నీకు నీ మనవడు ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులకు వాళ్ల పిల్లలు అంత ఇంపార్టెంటు. 26 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతే పట్టించుకోవు. రేప్ చేసిన శ్రీనివాసరెడ్డిని ఎన్ కౌంటర్ చేయవు.

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వవు. నీ రాజ్యం నడుస్తుందని గర్వ పడుతున్నావా...పెద్దమ్మతల్లీ.. రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోవాలే. ప్రజల ఉసురు ముట్టాలే అంటూ శాపనార్థాలు పెట్టారు.  అంతే కాదు  26 మంది ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. ‘కేసీఆర్.. నీకు బాగా నెత్తికెక్కిందిరా బాబు.. ప్రజలు నిన్ను తిప్పితిప్పి కొడతారు’ అని హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: