లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు పెద్ద మేధావి మాదిరిగా సర్వే ఫలితాలు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క నాకు ఏ రాజకీయ పార్టీతో సంభందం లేదంటూనే తన కుల పిచ్చి వదిలిపెట్టలేదు.  ఏపీ జనాలు సైకిల్ ను ఎంచుకున్నారని ఈయన వ్యాఖ్యానించారు. తద్వారా రేపు తను ఏం చెప్పబోతున్నట్టో ఈ రోజే తెలియచెప్పారు. అయితే లగడపాటి తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా తన అంచనాలను  నిజమే అయ్యాయని ఇప్పుడు పరోక్షంగా చెబుతున్నారు.


అదెలాగంటే.. కొన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లు రెండో స్థానంలో వచ్చారట! అలా ఈయన అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయట! ఇదేదో కవరేజ్ ప్రయత్నంలా ఉంది. రేపు తను చెప్పే విషయాలను జనాలు నమ్మాలన్నట్టుగా లగడపాటి ఇప్పుడు తెలంగాణ ఫలితాల విషయంలో జరిగిన డ్యామేజ్ ను కవరేజ్ చేసుకుంటున్నారు.రేపు ఎగ్జిట్ పోల్  అంచనాలను చెప్పబోతూ.. లగడపాటి ఇప్పుడు చెప్పిన మాటల్లో 'తెలంగాణ ప్రజలు కారును ఎంచుకుంటే.. ఏపీ ప్రజలు సైకిల్ నే ఎంచుకున్నారు..' అనే మాట మాట్లాడారు.


బహుశా తెలుగుదేశం నెగ్గుతుందని రేపు చెప్పడానికి ఈ రోజు లగడపాటి ఇలా మాట్లాడారని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అనేది మాత్రం అనుమానమే! ఏదేమైనా రేపు ఎగ్జిట్ పోల్స్ ను చెప్పబోతున్నారు లగడపాటి. అలాంటి మాటలు ఎన్ని చెప్పినా ఈవీఎంలలోని ఫలితాలు అయితే మారిపోవు. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ వినీ .. అసలు ఫలితాల కోసం ఎదురుచూడటమే. దీని వల్ల జనాలకు అయితే నష్టం లేదు. ఈయన చెప్పే జోస్యం అసలు ఫలితాల్లో ఫలించకపోతే మాత్రం.. అప్పుడు లగడపాటి ఇలా సర్వేలు చెప్పే దుకాణం మూసేసుకోవాల్సి ఉంటుందని మాత్రం చెప్పవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: