లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు పెద్ద మేధావి మాదిరిగా సర్వే ఫలితాలు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క నాకు ఏ రాజకీయ పార్టీతో సంభందం లేదంటూనే తన కుల పిచ్చి వదిలిపెట్టలేదు. ఏపీ జనాలు సైకిల్ ను ఎంచుకున్నారని ఈయన వ్యాఖ్యానించారు. తద్వారా రేపు తను ఏం చెప్పబోతున్నట్టో ఈ రోజే తెలియచెప్పారు. అయితే లగటిపాటి చిలక జోస్యం పై విజయ సాయి రెడ్డి ట్విట్టర్లో స్పందించాడు.
లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్ కాదని.. ఎల్లో జలగ అని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కెచ్లో భాగమే లగడపాటి సర్వే అని ఆరోపించారు. మే 23న వెలువడే ఫలితాల్లో తామే గెలుస్తున్నామని దీమా వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత చంద్రబాబు.. ఈవీఎంల మీద నెపం నెట్టి ఆరోపణలు చేస్తారని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు స్కెచ్లో భాగమే లగడపాటి సర్వే.
23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే.. గెలుస్తామని లగడపాటి చెప్పాడు, అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు.. ఇది ఎల్లో జలగ!’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘లగడపాటి గారూ.. మీ పేరును నారా రాజగోపాల్గా మార్చుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు.