ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై “ఆంధ్రా ఆక్టోపస్” గా పేరొందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తన సర్వే పలితాలను చూచాయగా ప్రకటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల నాడి తెలుసు కోవడం అనేది తనకు ఒక అలవాటుగా మారిందంటూ వ్యూహాత్మకంగా తన మనసు లోని తనవాళ్ళవైపే తూగే సర్వేలు ప్రకటిస్తారు. 


సినిమా సంస్కృతి పంచ ప్రాణాలుగా వంట బట్టించుకున్న ఆ సామాజిక వర్గ ప్రాణి నుంచి అంతకుమించి ఊహించటం దురాశే అవుతుంది. అయితే ఆయన సినిమా విడుదలకు ముందు టీజర్ వదలటం లాగా తన ఎన్నికల ఆక్టోపస్ సర్వే టీజర్ వెలువరించేశారు. 

గమ్మత్తేమంటే సర్వే లేదా టీజర్ లాంటి సర్వే పలితాలను మనం రివర్సులో అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకు “తెలంగాణా ఎన్నికల సర్వే ఫలితాల ప్రకారం ‘ప్రజా ఫ్రంట్’ ఘన విజయం పొందాలి కాని దానికి సరిగా వ్యతిరేఖ దిశలో తెలంగాణా రాష్ట్ర సమితి ఘన విజయం  పొందటం కాదు, విజయ దుందుభులు  మ్రోగించింది” అదీ ఆయన సర్వే పలితాల విశ్వరూపం. 

Image result for andhra octopus survey
ఇప్పుడు ఏపి, టీజర్ లాంటి సర్వే పలితాల గుఱించి:     

ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ పై ప్రజలు ప్రయాణం చేశారని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయన పరోక్షంగా సంకేతా లిచ్చారు అంటే సినిమా సాంకేతిక పరిభాషలో “టీజర్ వదిలారు” అన్నమాట. 

తెలంగాణలో ఓటర్లు కారు ప్రయాణం చేశారని అంటూ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ సీట్లు సాధించిందని గుర్తు చేస్తూ తన ఆక్టోపస్ సర్వే పలితాలను నమ్మవద్దని ఎందుకంటే రిజల్ట్స్ వ్యతిరేఖంగా వస్తాయని ముందే కమ్మ కమ్మగా పరోక్షంగా చెప్పేశారన్న మాట. అప్పుడు ఆయన చెప్పింది 'ప్రజా ఫ్రంట్ గెలుస్తుందని'  ఆయన ఈ మాట చెప్పటం సిగ్గుచేటు. 

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్నిరేపు సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు. ఈ రోజు తాను చెబుతున్నది తాను పరిశీలించిన విషయ మని ఆయన చెప్పారు. రేపు చెప్ప బోయేది తమ “టీమ్ చేసిన సర్వే ఫలితాలు” చెబుతానని ఆయన అన్నారు.  తాను ఏ పార్టీకి చెందని తటస్థం వ్యక్తిగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తన సర్వే ఫలితాలు తేడా వచ్చాయన్నారు. తేడా వచ్చింది కదా! అని తాను వదిలెయ్యలేదని అయినా మళ్లీ సర్వే చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. 
Image result for Sivaji & lagadapati
తాను ఆదివారం తిరుపతి వెళ్తున్నానని అక్కడ ఏపి ఎన్నికలపై సర్వే ఫలితాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఫలితాలు, ఏపీ లోని లోక్ సభ, అసెంబ్లీ ఫలితాలను వెల్లడిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలు కారు ఎక్కితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సైకిల్ ఎక్కేశారని లగడపాటి స్పష్టం చేశారు. ఏదో ఒక పార్టీకే ఫలితాలు అనుకూలంగా వెల్లడవుతాయని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలన్నదే తమ అభిమతమని ఉపసంహారం తో ముగించారు.  ఇంతవరకు ఆయన చెప్పింది సర్వే టీజర్.
Image result for lagadapati rajagopal
సొంఠినేని శివాజి అంటే గరుడపురాణం శివాజి లాగానే ఈయన కూడా, తటస్థుడే. ఆయన ప్రసంగం విని ఈయన్ని తటస్థుడు అంటే మనం కొత్త నిఘంటు అర్ధాన్ని స్పృజించుకోవాలి.  తటస్థుడు అంటే సొంఠినేని లగడపాటి పరి భాషలో "మన కులం వాడు" అని అర్ధం.  తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపైనే కాకుండా కేంద్రప్రభుత్వం పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రత్యేక దృష్టిలో చూడటం జరిగింద న్నారు లగడపాటి. ఈ ఎన్నికల ప్రక్రియలో ఫలితాలు ఎలా వస్తాయి అనే దానిపై ప్రజ లంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. 

తాను అమెరికాలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. వారంతా మనం కోరుకోకుండానే రాష్ట్రం విడి పోయిందని, కానీ వచ్చిన మన రాష్ట్రానికి రాజధాని లేదు, నిధులు లేవు అని వారంతా ఆందోళన చెందారని తెలిపారు. తాము ఎక్కడ ఉన్నా చివరకు చేరాల్సిందే ఆంధ్ర ప్రదేశ్ కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆరా తీశారని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాజధాని నిర్మాణానికి స్వచ్ఛంధంగా భూములు ఇచ్చారంటూ లగడపాటి రాజగోపాల్ అభినందించారు. 
Image result for speech of chandrababu lokesh
ఎన్నికల ఫలితాలపై రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు. వారి కోరిక లను వారి ఆశలను సార్థకం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది కాబట్టే పాలకుడి కోసం వారంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు.  రాష్ట్ర రాజధాని అభివృద్ధి భాగా జరుగుతుందని, ప్రాజెక్టులు ఎంతో చక్కగా జరుగు తున్నాయని కేంద్రం నుంచి నిధులు కాస్త అటు ఇటు అయినా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లలా జరుగుతుందని రైతులకు తాను స్పష్టం చేసినట్లు లగడపాటి తెలిపారు. 

గతంలో బహిసభ గురించి చెప్పుకునే వారని అయితే ప్రస్తుతం రాబోయే రోజుల్లో మన శాసనసభ గురించి కూడా చెప్పుకుంటా రని అభిప్రాయపడ్డారు. రాజధాని అభివృద్ధి బాగా జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు మారినా, అభివృద్ధిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.  ప్రత్యేక హోదా రాకుండానే కియా, అశోక్ లే ల్యాండ్, హీరో, విశాఖపట్నం జిల్లాలో అనేక ఐటీ పరిశ్రమలు వచ్చాయని మరిన్ని వచ్చే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఉద్యోగ అవకాశాలు అత్యధికం గా వచ్చే ఐటీ, కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చే అవకాశం ఉందన్నారు. 

40వేల ఎకరాల్లో గ్రీన్-ఫీల్డ్ తరహాలో రాజధానిని నిర్మించిన ఘనత ఎక్కడా లేదన్నారు. ఢిల్లీ రాజధాని యమునా నదితీరాన నిర్మించారని కానీ అక్కడ నీరు ఉండదని మన రాష్ట్ర రాజధానిని కృష్ణానదీ తీరాన అమరావతిలో నిర్మించడం జరిగిందన్నా రు. ఎప్పుడూ కృష్ణానదీ ఎండిపోదని నీటితో కలకలలాడుతుందన్నారు. పోరాటాలతో పార్టీలు తలొగ్గే పరిస్థితి లేదన్నారు. కలిసి ఉంటేనే ఏదైనా సాధించు కోవచ్చన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంట్ స్థానాలు ఉండేవి కాబట్టి బలంగా ఉండే వాళ్లమని రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఆ పరిస్థితి మారిందన్నారు. కాబట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసే ఏదైనా సాధించ గలుగుతామన్నారు. ఈ ఉపన్యాసం ఆసాంతం తెలుగుదేశం అధినేత ఆయన కుమారుడు ఇతర ప్రతినిధులు మాట్లాడినట్లే ఉందికదా! అందుకే ఈ సర్వే పలితాలు కూడా తెలుగుదేశం పార్టీ చేసిన సర్వే అదే టీజర్ గా భావిస్తే మంచిది.  
Image result for Sivaji & lagadapati
ఈనెల 19న తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన సర్వే ఫలితాలు వ్యతిరేకంగా రావడంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తానని గతంలోనే లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా ఆయన శనివారం అంటే ఒకరోజు ముందే ఎన్నికల ఫలితాలపై స్పందించడం విశేషం. ఇప్పటి వరకు కేవలం టీజర్ మాదిరిగా తన సర్వే ఫలితాలను వెల్లడించిన లగడపాటి రాజగోపాల్ ఈ రోజు అంటే ఆదివారం సాయంత్రం పూర్తిస్థాయిలో ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా మే 23న ఫలితాలు విడుదల కానున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: