దేశం లో వస్తున్న దాదాపు అన్నీ ఎగ్జిట్ పోల్స్ కూడా జగన్ మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఘంటా పదంగా చెబుతూ ఉండడం తో చంద్రబాబు కి చెమటలు మొదలు అయ్యాయి అని అంటున్నారు వైకాపా వారు.


నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ ఎంత పర్ఫెక్ట్ గా గడిచిన తెలంగాణ ఎన్నికల్లో చెప్పారు అనేది మనం క్లియర్ గా చూశాం. ఈ నేపధ్యం లో చంద్రబాబు మళ్ళీ అధికారం లోకి వస్తారు అని కేవలం లగడపాటి మరి ఒక ఇద్దరు తప్ప దాదాపు ఎనభై శాతం పైగా ఎగ్జిట్ పోల్స్ లో జగన్ ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని తేల్చేసాయి ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అంటూ .. తన సన్నిహితుల దగ్గర షాకింగ్ గా స్పందించారు అంటూ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.



ఉదయం వరకూ స్ట్రాంగ్ గా కనిపించిన చంద్రబాబు నాయుడు సడన్ గా ఒక్కసారి గా సైలెంట్ అయ్యారు అనీ సన్నిహితుల సైతం ఇలా జరుగుతుంది అని అసలు ఊహించలేదు అంటూ స్పందించినట్టు సమాచారం. ఏదేమైనా తన పథకాలు, తన తెలివి తేటలు తనని కాపాడతాయి .. మళ్ళీ అధికారం ఇస్తాయి అని అనుకున్న చంద్రబాబు కి అతిపెద్ద బ్యాడ్ న్యూస్ చెప్పినట్టుగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు.



లోక్ సభ , అసంబ్లీ రెండింటా చంద్రబాబు ని జగన్ పూర్తిగా డామినేట్ చెయ్యబోతున్నారు అనేది ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చెయ్యడం తో బాబు మొఖం మాడిపోయింది అంటున్నారు సన్నిహితులు 


మరింత సమాచారం తెలుసుకోండి: